Home » » AP NEWS : రాజ్యాంగ పదవుల కంటే.. జనం మధ్య పని చేయడమే మాకు ఇష్టం: వెంకయ్యనాయుడు

AP NEWS : రాజ్యాంగ పదవుల కంటే.. జనం మధ్య పని చేయడమే మాకు ఇష్టం: వెంకయ్యనాయుడు

 

AP NEWS : రాజ్యాంగ పదవుల కంటే.. జనం మధ్య పని చేయడమే మాకు ఇష్టం:వెంకయ్య

గుంటూరు: గతంలో పత్రికలు, విద్య, వైద్యం ఓ మిషన్ కోసం నడిచేవి అని.. ఇప్పుడు కమీషన్ కోసం నడుస్తున్నట్లుగా ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.రాజ్యాంగ పదవుల కంటే.. జనం మధ్య పని చేయడమే తనకు ఇష్టమని వెంకయ్య తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందని, చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని వెంకయ్యనాయుడు చెప్పారు. చట్ట సభల్లో ఉండేవారు మరింత బాధ్యతగా ఉండాలని, రాజ్ పథ్ను కర్తవ్యపథ్గా ప్రధాని మార్చారని, సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కరించారని వెంకయ్యనాయుడు తెలిపారు. గాంధీ ముందుండి నడిపినా మిగతా వారి పాత్ర తక్కువ కాదని, మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి, మన భాషను మనం గౌరవించుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.