Home » » భారీగా బంగారం పట్టివేత

భారీగా బంగారం పట్టివేత

 

భారీగా బంగారం పట్టివేత

కృష్ణ జిల్లా...గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం(Gannavaram International Airport)లో కస్టమ్స్ అధికారులు(Customs officials) భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. నిన్న (గురువారం) సాయంత్రం దుబాయ్ నుండి వచ్చిన విమానంలో భారీగా బంగారం పట్టుబడినట్టు సమాచారం. హైదరాబాద్(Hyderabad) నుంచి స్పెషల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు‌ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా.. సీఎంఓ కార్యాలయంలో కీలక అధికారి భార్య దుబాయ్ నుండి బంగారం తీసుకుని వచ్చినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా(Air India) సంస్థలో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది బంగారం దాటవేసే విషయంలో పెద్ద పాత్ర ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారం తీసుకొని వచ్చిన మహిళతో పాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని కూడా కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.