Home » » Cheetah: చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ.. || PM MODI || BJP | INDIA ||NARENDRA MODI

Cheetah: చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ.. || PM MODI || BJP | INDIA ||NARENDRA MODI

 Cheetah: చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ..




భోపాల్‌: అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుత పులుల్లో ఒక రకం).. దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు.



ఇదో చారిత్రక క్షణం..: మోదీ

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ''కొన్ని దశాబ్దాల తర్వాత చీతాలు మళ్లీ మన గడ్డపైకి వచ్చాయి. ఈ చారిత్రక క్షణాన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇందుకు సహకరించిన నమీబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వారి సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. దురదృష్టవశాత్తూ 1952లో మనం వీటిని అంతరించిన జాతిగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చేందుకు ఎలాంటి అర్థవంతమైన ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను జరుపుకుంటోన్న వేళ చీతాలు మళ్లీ మన దేశానికి రావడం ఆనందంగా ఉంది. కునో నేషనల్‌ పార్క్‌లో వీటిని చూసేందుకు ప్రజలు కొంతకాలం వేచి చూడక తప్పదు. ఇవి మన దేశానికి అతిథులుగా వచ్చాయి. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. చీతాలు ఇక్కడ సెటిల్‌ అయ్యేలా భారత్‌ అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. అంతర్జాతీయ మార్గదర్శకాలను పాటిస్తూ చీతాలను సంరక్షిస్తాం'' అని మోదీ తెలిపారు.
ఈ ప్రాజెక్టుతో దాదాపు 74ఏళ్ల తర్వాత భారత్‌లోకి మళ్లీ చీతాలు ప్రవేశించాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలు తీసుకొచ్చారు. 4 నుంచి 6 ఏళ్ల వయసున్న ఐదు ఆడ, మూడు మగ చీతాలను నేడు పార్క్‌లో విడుదల చేశారు