Home » » AP Govt: మూడు రాజధానులు.. సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం

AP Govt: మూడు రాజధానులు.. సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం

 


AP Govt: మూడు రాజధానులు.. సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం



దిల్లీ: మూడు రాజధానుల అంశంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని.. ఈ అంశంలో వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.