Home » » 50వ సీజేఐగా డివై చంద్రచూడ్

50వ సీజేఐగా డివై చంద్రచూడ్

 

50వ సీజేఐగా డివై చంద్రచూడ్

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై. చంద్రచూడ్‌ నియమితులు కానున్నారు. ఈ మేరకు ఆయన పేరును ప్రస్తుత సిజెఐ యుయు లలిత్‌ ప్రతిపాదించారు.50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ వచ్చేనెల పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్ల పాటు ఆయన పదవీకాలం కొనసాగనుంది. సాంప్రదాయం ప్రకారం సిజెఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి పేరును సిఫారసు చేయాల్సి ఉంది. దీంతో నవంబర్‌ 8న యుయు లలిత్‌ పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో తరువాతి సిజెఐ పేరును ప్రతిపాదించాల్సిందిగా న్యాయశాఖ ఆయనకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.